దుబాయ్: తనను ఎలాగైనా స్వదేశానికి పంపించాలంటూ ఓ గర్భిణీ మహిళ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లాక్డౌన్ వల్ల విమానాలు కూడా ఎగరనందున తక్షణమే భారత ప్రభుత్వం తనకు సాయం చేయాలంటూ వేడుకుంది. కేరళలోని కోజికోడ్కు చెందిన మహిళ అతిరా గీతా శ్రీధరన్ దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తుంది. ఆమె భర్త నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు. ఆ దేశంలో విధించిన లాక్డౌన్లో ఈ రంగానికి మినహాయింపునివ్వకపోవడంతో అతనికి కనీసం సెలవు కూడా దొరకట్లేదు. ఇదిలా వుంటే ప్రస్తుతం ఆమె గర్భిణీ. (హమ్మయ్య!.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు)
ఎలాగైనా భారత్కు తీసుకెళ్లండి: గర్భిణీ వేడుకోలు